ఎన్టిఆర్ ప్లాప్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్కు స్టోరీ వినిపిస్తున్నాడట...
ఎన్టిఆర్ ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయి 'రభస'గా చేసుకున్న 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్కు మళ్ళీ అవకాశం వచ్చేసింది. సినిమాటోగ్రాఫర్గా కూడా అనుభవం వున్న ఈయన తన సినిమాలకు మాత్రం తమిళ కెమెరామెన్ను తీసుకుంటాడు. ఈమధ్య తన దగ్గర కథల్ని పట్టుకుని పలువురు హీరోలను కలిసినట్లు తెలిసింది. ఇందులో అగ్రహీరోలుకూడా వున్నారు.
అల్లు అర్జున్, వెంకటేష్లను కలిసినా.. వారి డేట్స్ ఖాళీ లేకపోవడంతో తాజాగా పవన్ కళ్యాణ్ను కలిసినట్లు చెబుతున్నారు. ఈసారి డైరెక్ట్ కథ కాకుండా రీమేక్పై దృష్టిపెట్టాడు. తమిళ 'వేదాళమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు ఈ సినిమా నిర్మాత ఏ.ఎం.రత్నం నుంచి హక్కులు కూడా పొందాడట. అయితే ఆ సినిమాకు పవన్ సరిగ్గా సరిపోతారని తెలుస్తోంది. తెలుగులో కనుక చేస్తే.. ప్రముఖ సంస్థ ద్వారానే పవన్ నిర్మాణ సంస్థలో చేసే అవకాశం లేకపోలేదు.