ఆ వెధవలు... దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడాలి : శృతిహాసన్
ఇతరుల గురించి గాసిప్స్ రాసే వెధవలు... దమ్ముంటే వారు రాసే గాసిప్స్నే నా ముందుకు వచ్చి మాట్లాడాలని హీరోయిన్ శృతిహాసన్ అంటోంది. ప్రస్తుతం 'ప్రేమమ్' తెలుగు రీమేక్తోపాటు తమిళంలో రెండు సినిమాలతో బిజీగా ఉన్న శృతిహాసన్.. తనపై వస్తున్న గాసిప్స్పై సోషల్ నెట్వర్క్ సైట్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించింది.
"ప్రతి రోజు ఉదయం పేపర్ చూడడానికి ముందు నా గురించి గాసిప్స్ ఉండకూడదని కోరుకుంటాను. ఒకవేళ ఉంటే చూసి నవ్వుకుంటాను. ఇతరులపై వచ్చే గాసిప్స్ గురించి అస్సలు పట్టించుకోను. కనీసం ఆ వార్త చదవడానికి కూడా ట్రై చెయ్యను. నా గురించి లేకపోతే సంతోషంగా తర్వాతి పనిలోకి వెళ్లిపోతాను" అని చెప్పుకొచ్చింది.
అంతేనా, "గాసిప్స్తోపాటు నాకు నవ్వు తెచ్చే ఇంకో విషయం ఉంది. అదే ట్విట్టర్. ఎవరో ముక్కు, మొహం తెలియనివారు కంప్యూటర్ ముందు కూర్చొని ట్విట్టర్లో ఇష్టమొచ్చిన రాతలు రాస్తుంటారు. వాటిని చదివి చాలా నవ్వుకుంటాను. ఆ రాతలు రాసేవారు దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడండి. అలాంటి వారిని ఓసారి కలవాలనిపిస్తుంటుంది" అని పేర్కొంది.