శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (10:39 IST)

నిర్మాతతో శ్వేతా బసు చెట్టాపట్టాల్... మీ సానుభూతి అక్కర్లేదంటున్న హీరోయిన్

ఇటీవల కథానాయికలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ వార్తలు సోషల్ మీడియాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మొన్నటికిమొన్న శ్వేతాబసు ప్రసాద్ రెడ్ లైట్ దందాను గుట్టుచప్పుడు కాకుండా పోలీసుల

ఇటీవల కథానాయికలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ వార్తలు సోషల్ మీడియాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మొన్నటికిమొన్న శ్వేతాబసు ప్రసాద్ రెడ్ లైట్ దందాను గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు రట్టుచేసిన విషయం తెలిసిందే. జాతీయ అవార్డు విజేత, 'కొత్త బంగారులోకం' హీరోయిన్ శ్వేత బసు వ్యభిచారంలోకి కాలు పెట్టలేదని, చలనచిత్ర పరిశ్రమలో తనకు పని లేకపోవడం అనేది ఎప్పుడూ లేదని ఆమె చెప్పింది. 2014లో సెక్స్ రాకెట్లో శ్వేతా బసు పట్టుబడటం అప్పట్లో సంచలనంగా మారింది. 
 
సెక్స్ రాకెట్‌లో దొరికిన శ్వేతాని కొన్నాళ్ళు సినిమాలు పలకరించలేదు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అనురాగ్ కశ్యప్ దగ్గర స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో చిన్న చిత్రాల నిర్మాత, దర్శకుడు రోహిత్ మిట్టల్ అనే వ్యక్తితో ప్రేమలో పడిందట శ్వేతా. ప్రస్తుతం వీరిద్దరు ముంబైలో చక్కర్లు కొడుతుండగా వీరి ప్రేమాయణం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 
 
ప్రస్తుతం ఆమె చంద్ర నందిని అనే హిందీ టీవీ సీరీస్‌లో నటిస్తున్నారు. షో ప్రమోషన్‌లో పాల్గొన్న ఆమెకు తన గతం గురించిన ప్రశ్నలు మీడియా నుండి ఎదరయ్యాయి. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఆమె తనదైన రీతిలో స్పందించారు. గతం గురించి మాట్లాడటానికి నిరాకరించారు. మీ సానుభూతి తనకు అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఆమె తన ప్రొఫెషన్లో బిజీగా ఉన్నారు. తన ఫోకస్ అంతా కెరీర్ మీదనే ఉందని అన్నారు.