బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Ivr
Last Modified: గురువారం, 23 జులై 2015 (10:53 IST)

శ్రుతి హాసన్ కాలు పట్టుకున్న 'శ్రీమంతుడు' మహేష్ బాబు... కారణం...?

మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన 'శ్రీమంతుడు' చిత్రం అప్పుడే చర్చల్లోకి వెళ్లిపోయింది. వన్ నేనొక్కడినే చిత్రంలో తన కాళ్ల వెంట హీరోయిన్‌ను 'కుక్క' మాదిరిగా మహేష్ బాబు తిప్పుకున్నాడంటూ అప్పట్లో తెగ గొడవ జరిగింది. కానీ తాజా చిత్రం శ్రీమంతుడులో మహేశ్ బాబు, శృతి హాసన్ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్‌చల్ చేస్తోంది. జ‌త‌క‌లిసే.. అంటూ సాగే పాటకు సంబంధించి ట్రైల‌ర్‌లో శ్రుతిహాస‌న్ కాలుని మ‌హేష్ చేత్తో ప‌ట్టుకుంటాడు. ఈ సీన్ చూసిన వారు మ‌హేష్ బాబు, హీరోయిన్ కాలు ప‌ట్టుకోవ‌డ‌మేంటని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. 
 
ఐతే అంతకుముందు సమంత హీరోయిన్లంటే మహేష్ బాబుకు చిన్నచూపు అని గతంలో ట్వీటిన నేపధ్యంలో మహేశ్ బాబు ఇలాంటి సీను కావాలనే పెట్టించాడనే టాక్ వినబడుతోంది. గతంలో `1` సినిమా పోస్ట‌ర్‌లో కృతిస‌న‌న్ హ‌చ్‌ కుక్క‌పిల్ల‌లా మ‌హేష్‌ని అనుసరిస్తున్న‌ట్టు ఉంది. ఆ పోస్టరును చూసిన సమంత అప్పట్లో తెగ ఉడుక్కుంది. 
 
`అమ్మాయిల్ని కించ‌ప‌రిచేలా ఉంద‌`ని కామెంట్ కూడా చేసింది. దీనిపై మహేశ్ అభిమానులు కూడా సమంతపై రివర్స్ ఎటాక్ ఇచ్చారు. కొన్నాళ్లు ట్విట్టర్లో మాటల యుద్ధం జరిగింది. ఈ నేపధ్యంలో మహేష్ బాబు తన శ్రీమంతుడు చిత్రంలో కావాలనే ఈ సీనును పెట్టినట్లు చెప్పుకుంటున్నారు.