శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2016 (16:59 IST)

ప్రభాస్ హీరోగా త్రిభాషా చిత్రం.. బడ్జెట్ రూ.150 కోట్లు

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం 'బాహుబ‌లి'. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన స్పంద‌న‌తో బాహుబ‌లి 2 మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించ‌డానికి రాజ‌మౌళి ప‌క్కా ప్ర‌ణాళిక రెడీ చేస్తున

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం 'బాహుబ‌లి'. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన స్పంద‌న‌తో బాహుబ‌లి 2 మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించ‌డానికి రాజ‌మౌళి ప‌క్కా ప్ర‌ణాళిక రెడీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ 'బాహుబలి 2' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన రానుంది. 
 
ఈ సినిమా తర్వాత ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. తెలుగు.. హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకి రూ.150 కోట్లు ఖర్చు పెట్టనున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
హాలీవుడ్‌కి చెందిన టాప్ టెక్నీషియన్స్‌ను తీసుకోనున్నారని చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. మొత్తానికి ప్రభాస్ తదుపరి సినిమా కూడా భారీదేనన్నమాట!