శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:53 IST)

భారతదేశానికి స్విమ్మింగ్‌లో తొలి కాంస్య పతకాన్ని సాధించిన మాధవన్ కుమారుడు

నటుడు మాధవన్ తన కుమారుడు వేదాంత్ సాధించిన విజయాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పంచుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటయా అంటే వేదాంత్ థాయ్‌లాండ్ ఏజ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ 2018 (1500 మీ) పోటీల్లో పాల్గొని తొలిసారిగా భారతదేశానికి కాంస్య పతకాన్ని సాధించి తెచ్

నటుడు మాధవన్ తన కుమారుడు వేదాంత్ సాధించిన విజయాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పంచుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటయా అంటే వేదాంత్ థాయ్‌లాండ్ ఏజ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ 2018 (1500 మీ) పోటీల్లో పాల్గొని తొలిసారిగా భారతదేశానికి కాంస్య పతకాన్ని సాధించి తెచ్చాడు. 
 
ఈ సందర్భంగా నటుడు మాధవన్... వేదాంత్ ఈ విభాగంలో మన దేశానికి తొలి పతకాన్ని సాధించడం నాకు, నా భార్య సరితకు ఎంతో గర్వకారణంగా వుంది. మీ అందరి ఆశీస్సులకు ధన్యవాదాలు అంటూ తెలిపాడు. వేదాంత్ మరిన్ని విజయాలు సాధించాలని నెటిజన్లు పోస్టింగులు చేస్తున్నారు.