గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2017 (14:49 IST)

హైకోర్టు సూచనతో ఒక్కటై... శ్రీవారి సేవలో పాల్గొన్న రంభ దంపతులు...

సినీ నటి రంభ తన భర్త ఇంద్రన్ పద్మనాభన్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం తన భర్త, పిల్లలతో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ అవకాశాలు తగ్గిన తర్వాత కెనడాకు చెందిన ఇంద్రన్ పద

సినీ నటి రంభ తన భర్త ఇంద్రన్ పద్మనాభన్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం తన భర్త, పిల్లలతో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ అవకాశాలు తగ్గిన తర్వాత కెనడాకు చెందిన ఇంద్రన్ పద్మనాభన్ అనే పారిశ్రామికవేత్తతో రంభ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని చెన్నైకు వచ్చిన రంభ.. కోర్టు ద్వారా న్యాయపోరాటానికి దిగారు. తన భర్త నెలకు రూ.2.50 లక్షల భృతి చెల్లించాలని తొలుత కోర్టుకెక్కింది. ఆ తర్వాత తనతో కాపురం చేసేలా భర్తను ఆదేశించాలని మరో పిటీషన్‌ను కూడా దాఖలు చేసింది. 
 
వీటన్నింటిని పరిశీలించిన కోర్టు.. ఇద్దరూ కలిసి సామరస్య కేంద్రంలో ఓ నిర్ణయానికి రావాలంటూ సూచన చేసింది. దీంతో వారిద్దరు మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరు ఒక్కటై తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వారివెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.