గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (15:57 IST)

'సెల్ఫీరాజా' హీరోయిన్‌‌కు ఓ రాత్రికి రేటెంతో తెలుసా?

'సెల్ఫీరాజా' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ సాక్షి చౌదరి. ఈమె 'పోటుగాడు', 'జేమ్స్‌బాండ్' వంటి చిత్రాల్లో నటించారు కూడా. ఈమెకు కొందరు ఫోన్ చేసి వేధిస్తున్నారట. నీ రేటెంత.. రాత్రికి వస్తావా అంటూ అడుగుతున్నారట. దీనిపై సాక్షి చౌదరి స్పందిస్తూ, తాను చేసిన సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులకు బాగా దగ్గరైననట్టు చెప్పారు. పాగా, తనను రాత్రికి వస్తావా? అని అడుగుతున్నారని తెలిపింది.
 
ఒక రాత్రికి కోటి రూపాయలు ఇస్తామంటూ కొందరు తనకు ఆఫర్ ఇస్తున్నారని.. మరికొందరు రాత్రికి వస్తావా? రేటెంత? అని వేధిస్తున్నారని తెలిపింది. నటి అయినంత మాత్రాన చులకనగా చూడాల్సిన పనిలేదని, తనకు ఆఫర్ చేసేవారు పెద్ద మూర్ఖులని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆఫర్లతో మరోసారి తన ముందుకొస్తే వారి బండారాన్ని బయటపెడతానంటూ సాక్షి హెచ్చరించింది.