శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2016 (15:22 IST)

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం సబబే... పాక్ సింగర్‌ అద్నాన్ సమీ.. గాలిస్తున్న పాక్ ప్రజలు

పాకిస్థాన్‌ సింగర్ అద్నాన్ సమీ చిక్కుల్లో పడ్డారు. పాక్ ఆక్రమిక కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ మెరుపుదాడి చేయడాన్ని ఆయన స్వాగతిస్తున్నారు. ఈ దాడులు చేయడం సబబేనని వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్‌ సింగర్ అద్నాన్ సమీ చిక్కుల్లో పడ్డారు. పాక్ ఆక్రమిక కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ మెరుపుదాడి చేయడాన్ని ఆయన స్వాగతిస్తున్నారు. ఈ దాడులు చేయడం సబబేనని వ్యాఖ్యానించారు. 
 
యితే, ఆయ‌న‌పై పాక్‌లో పెద్ద ఎత్తున మండిప‌డ్డారు. వాటిపై ఆయ‌న తాజాగా స్పందిస్తూ త‌న‌ వ్యాఖ్యలపై పాక్ ప్ర‌జ‌లు తీవ్రంగా స్పందిస్తున్నార‌ని అన్నారు. వాటినిబ‌ట్టి త‌న‌కు ఆ దేశీయులు పాకిస్థాన్, టెర్రరిజం రెండింటినీ ఒకటేగా భావిస్తున్న‌ట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.
 
కాగా, బాలీవుడ్ ఎన్నో పాటలు పాడిన, పాక్ దేశస్థుడైన సింగర్ అద్నాన్ సమీకి ఇరు దేశాల్లో మంచి గుర్తింపు ఉంది. పైగా ఆయన భారత్ పౌర‌స‌త్వం తీసుకొని ఇక్కడే నివ‌సిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసివుంటారని పాక్ ప్రజలు భావిస్తున్నారు.