ఎఫైర్ సినిమాకు సెన్సార్ దక్కేనా..?: తొలి లెస్బియన్ తెలుగు సినిమాకు..?
ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకునే నేపథ్యంలో శ్రీరాజన్ అనే దర్శక నిర్మాత తీసిన చిత్రం 'ఎఫైర్'. ప్రశాంతి, గీతాంజలి జోడీగా నటించారు. ధనరాజ్, రాకేస్, సాయిరాజ్ ఇతర పాత్రలు పోషించారు. వీరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు, ప్రేమలు యూత్ను ఆకట్టుకునేలావుంటాయి. అయితే ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్కు వెళ్లే పనిలో వుంది.
ఒకవేళ సెన్సార్ అవుతుందో లేదో అనే అనుమానం కొద్దిమందిలో వుంది. బాలీవుడ్లో మహేష్ భట్, ఏక్తాకపూర్ల ఫార్మెట్లో శ్రీరాజన్ చిత్రాన్ని తీశాడు. ఇతను ఇంతకుముందు సీరియల్స్లో పలు పాత్రలు పోషించాడు. సినిమాకు తనే నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకత్వం చేశాడు.
ఐస్క్రీమ్ చిత్రాన్ని నిర్మించిన రామసత్యనారాయణ ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించాడు. ఈ సినిమా ఆడియో త్వరలో రిలీజ్ కానుంది. అయితే తొలి తెలుగు లెస్బియన్ సినిమాకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది ఇంకా తేలాల్సి వుంది.