శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (12:43 IST)

మళ్లీ సైనికుడిగా బన్నీ.. సరైనోడు హిట్‌తో వక్కంతం వంశీ డైరక్షన్‌లో?

'సరైనోడు'సినిమాతో మాస్ హిట్ సాధించిన 'అల్లు అర్జున్' తన తాజాగా హరీష్ శంకర్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. 'దువ్వాడ జగన్నాథం' పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో 'అల్లు అర్జున్'తో పాటు 'పూజ హెగ్డే' హ

'సరైనోడు'సినిమాతో మాస్ హిట్ సాధించిన 'అల్లు అర్జున్' తన తాజాగా హరీష్ శంకర్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. 'దువ్వాడ జగన్నాథం' పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో 'అల్లు అర్జున్'తో పాటు 'పూజ హెగ్డే' హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే  రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్‌ని ఆకట్టుకుని మంచి వ్యూస్‌ కొల్లగొట్టింది.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది 'సరైనోడు' సినిమా. ఈ మూవీలో బన్నీ మిలటరీ ఆఫీసర్ రోల్ చేశాడు. ఈ పాత్రతో మరిన్ని మార్కులు కొట్టేశాడు అల్లు అర్జున్.
 
దీంతో మళ్లీ సైనికుడిగానే కనిపించాలని అల్లు అర్జున్ డిసైడయ్యాడు. వక్కంతం వంశీ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. మధుర శ్రీధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జూన్ నుంచి సినిమా షూటింగ్ స్టార్ చేసి, సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం క్యారా అద్వాని, దిశాపటానిలను హీరోయిన్లుగా ఎంపిక చేసినట్టు సమాచారం. వీళ్ల డేట్స్ ఆధారంగా వీళ్లలో ఒకర్ని లీడ్ రోల్ కు ఎంపిక చేస్తారని ఫిల్మ్ నగర్ సమాచారం.