లాయర్ అనురాధగా ఐశ్వర్యా రాయ్... 'జాజ్బా' టీజర్ రిలీజ్
నటుడు, నిర్మాత సచిన్ జోషి నిర్మిస్తున్న చిత్రం 'జాజ్బా'. ఐశ్వర్యరాయ్ రీ-ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం టీజర్ను ఇటీవలే ముంబైలో ఆవిష్కరించారు. సంజయ్ గుప్త దర్శకత్వం వహించారు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందిందని నిర్మాత తెలియజేస్తున్నాడు. లాయర్ అనురాధగా ఐశ్వర్య నటించింది. సచిన్ మాట్లాడుతూ.. సంజయ్ గుప్త, ఈసెల్ విజన్ స్టూడియోస్ సహకారంతో ఈ చిత్రాన్ని చేయడం ఆనందంగా వుందని పేర్కొన్నారు.
విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్ 8న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇర్ఫాన్, ఐశ్వర్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో షబానా ఆజ్మీ, జాకీ ష్రాప్, చందన్ రాయ్, అతుల్ కులకర్ణి, సిద్దార్థ్ కపూర్ తదితరులు నటించారు.