గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (09:37 IST)

హైదరాబాద్ వానలు : 'ఓ వాన దేవా! శాంతించు' అన్నట్లుగా దండంపెడుతున్న నాగార్జున

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఈ చిత్రంలో హథారామ్ బాబా భక్తుడి పాత్రను నాగార్జున పోషిస్తున్నాడు. ఈ చిత్రం సెట్‌కు సంబంధించి ఫొటో

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఈ చిత్రంలో హథారామ్ బాబా భక్తుడి పాత్రను నాగార్జున పోషిస్తున్నాడు. ఈ చిత్రం సెట్‌కు సంబంధించి ఫొటోలను చిత్రయూనిట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. 
 
ఒక ఫొటోలో నాగార్జున ఆకాశం వైపు చూస్తూ దండం పెడుతున్నట్లు ఉంది. ఈ ఫొటోను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి చూస్తే ‘ఓ వానదేవా! శాంతించు’ అంటూ నాగార్జున దండం పెడుతున్నట్లుగా ఉంది. మరో ఫొటో విషయానికి వస్తే.. ఇందులో రాఘవేంద్రరావు, నాగార్జున, బ్రహ్మానందం కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జలదిగ్బంధంలో చిక్కున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలు జలమయ్యాయి.