బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (18:04 IST)

చిరంజీవి, చెర్రీ అంటేనే కోపంతో ఊగిపోతున్న అక్కినేని నాగార్జున.. ఎందుకో?

టాలీవుడ్‌లో నాగార్జున-చిరంజీవి మంచి స్నేహితులు. వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్స్. అయితే చిరంజీవి, చెర్రీ అంటేనే ప్రస్తుతం నాగార్జునకు భలే కోపమొస్తోందట. రామ్ చరణ్ బ్రూస్లీ, అఖిల్‌కు చెందిన అఖిల్ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగుతోంది. ఈ నేపథ్యంలో బ్రూస్లీ మేకర్స్ అక్టోబర్ 15న చెర్రీ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 
 
అలాగే అఖిల్ మూవీ కూడా అక్టోబర్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే చెర్రీ కూడా బ్రూస్లీని అక్టోబర్ 21వ తేదీకే గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని అంతా సిద్ధం చేశాడట. దీంతో అక్కినేని నాగార్జున చెర్రీ అంటేనే మండిపడుతున్నారు.\
 
అందుకే నాగార్జున మెగాస్టార్, రామ్ చరణ్ అంటే కోప్పడుతున్నారని.. అఖిల్ ఫస్ట్ మూవీ సినిమా రిలీజ్‌కు ఫిక్స్ చేసిన రోజునే చెర్రీ కూడా తన సినిమాను విడుదల చేసేందుకు రెడీ కావడం ఎందుకని నాగ్ ఫైర్ అవుతున్నారట. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.