కేసీఆర్ సోదరుడి కుమారుని చిత్రం... ఆమె ఎదురుచూస్తోంది...
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు (కన్నారావు) నిర్మాతగా రూపొందించనున్న చిత్రం 'షీ'. 'ఈజ్ వెయిటింగ్' అనేది ఉపశీర్షిక. పర్స రమేష్ మహేంద్ర దర్శకుడు. ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని నిర్మాత శుక్రవారంనాడు తెలియజేస్తూ... అత్యున్నత సాంకేతిక విలువలతో సరికొత్త కథాంశంతో రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాం. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకముందని పేర్కొన్నారు.
దర్శకుడు తెలుపుతూ... దెయ్యం పట్టిందని చాలామంది చెబుతుంటే వింటుంటాం. అయితే మా సినిమాలో హీరో నాకు దెయ్యం పట్టాలని విచిత్రంగా ఆలోచిస్తుంటాడు. అలాంటి యువకుడికి దెయ్యం పడితే ఏం జరిగింది? ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అన్నదే చిత్ర ప్రధాన ఇతివృత్తం. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. నవతరం మనోభావాలకు దర్పణంలా వుంటుంది. కథపై నమ్మకంతో తేజేశ్వరరావు నిర్మించడానికి ముందుకు వచ్చాకరు. ప్రముఖ మలయాళ నటి టైటిల్ పాత్ర పోషించనుంది. త్వరలో వివరాలు తెలియజేస్తాం. దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్లో పూర్తిచేస్తాం. మార్చిలో విడుదలకు సన్నాహాలు చేయనున్నామని తెలిపారు.