గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2016 (13:04 IST)

అమీషా పటేల్‌కు ఏమైంది..? పూనమ్ పాండే మంత్రాన్ని ఫాలో అవుతుందా? సోషల్ మీడియాలో రచ్చ

పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్‌లతో నటించిన అమీషా పటేల్ ప్రస్తుతం దిగజారిపోతోంది. తెలుగులో పవన్ సరసన బద్రి, మహేష్ బాబు సరసన నాని చిత్రాలు చేసిన అమీషా పటేల్ హృతిక్ రోషన్‌తో 200లో ''కహో నా ప్యార్‌ హై

పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్‌లతో నటించిన అమీషా పటేల్ ప్రస్తుతం దిగజారిపోతోంది. తెలుగులో పవన్ సరసన బద్రి, మహేష్ బాబు సరసన నాని చిత్రాలు చేసిన అమీషా పటేల్ హృతిక్ రోషన్‌తో 200లో ''కహో నా ప్యార్‌ హై'' సినిమా ద్వారా బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఈ సినిమా కాస్త బ్లాక్ బస్టర్ కావడంతో అమీషాకు ఢోకా లేదనుకున్నారు. కానీ ఆపై అమీషాను అవకాశాలు అంతగా వరించలేదు. దీంతో కొన్ని సినిమాల్లో మాత్రమే కనిపించిన అమ్మడు.. ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అందుకే ప్రస్తుతం అవకాశాల కోసం రూటు మార్చింది. 
 
అభ్యంతరకర ఫోటోలను నెట్లో పోస్ట్ చేసి పరువు తీసుకుంటుంది. ఈ ఫోటోలను చూసి అమీషా ఇలా తయారైందేమిటని సినీ ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు. ఈ ఫోటోలకు ట్విట్టర్లో మిశ్రమ ట్వీట్లు వస్తున్నాయి. టూపీస్ డ్రెస్‌లో పెట్టిన ఫోటోలకు నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. నెటిజన్లు తిట్ల వర్షం కురిపిస్తున్నారు. 
 
అంతేగాకుండా నెటిజన్లు ఆమెను పూనమ్ పాండేతో పోల్చుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షవర్ లైక్ ఎ రాక్ స్టార్ అనే క్యాప్షన్‌తో పెట్టిన ఫోటోకు నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సీ గ్రేడ్ ఆర్టిస్టుతో పోల్చడం అమీషా పటేల్ ఫ్యాన్స్‌కు నచ్చలేదంటే.. అందుకు నెటిజన్లు ఏమంటున్నారంటే.. ఇలాంటి ఫోటోలు పెట్టకుండా ఉంటే ఎంతో మంచిదని హితవు పలుకుతున్నారు.

అవకాశాలు లేకపోవడంతో అమీషా ఇలాంటి పనులు చేస్తుందని, పూనమ్ పాండే ఇటీవల ఇచ్చిన ఓ స్టేట్ మెంట్‌ను అమీషా పటేల్ ఫాలో అవుతుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అదేంటంటే.. సోషల్ మీడియాలో అభ్యంతరకర ఫోటోలను పోస్టు చేస్తూ అందాలను ఆరబోయడం ద్వారానే పబ్లిసిటీ వచ్చిందని పూనమ్ పాండే అంగీకరించిన నేపథ్యంలో, అమీషా కూడా అదే మంత్రాన్ని పాటిస్తున్నట్లుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
అంతేగాకుండా రాఖీ సావంత్‌లా అమీషా పటేల్ చీప్‌గా ప్రవర్తిస్తుందని నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు. కహోనా ప్యార్ హై సీక్వెల్‌లో నటిస్తున్నానని అమీషా చెప్పినా.. నెటిజన్లు మాత్రం సెటైర్లతో తలనొప్పి తెచ్చిపెడుతున్నారు. మొత్తానికి అమీషా పటేల్‌కు సోషల్ మీడియా అంతగా  కలిసిరాలేదని సినీ పండితులు అంటున్నారు. అందుకే సోషల్ మీడియా షెట్టర్ క్లోస్ చేసి... సినిమా అవకాశాలపై పడితే అమ్మడుకు మంచి పేరు వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరి అమీషా ఏం చేస్తుందో...?