శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2017 (13:02 IST)

ఓ సూపర్ సీన్ చిత్రీకరించిన తర్వాత చెర్రీతో తీసిన సెల్ఫీ ఇదే- జబర్దస్త్ అనసూయ

రామ్‌చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 1985 నాటి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించ

రామ్‌చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 1985 నాటి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా టీజర్‌ను సంక్రాంతికి విడుదల చేయనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సంక్రాంతి పండుగ వాతావరణం ఉట్టిపడేలా టీజర్ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో రంగస్థలం సెట్స్ నుంచి యాంకర్ అనసూయ తీసిన సెల్ఫీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. జబర్దస్త్ యాంకర్ అయిన అనసూయ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటోలో చెర్రీతో కలిసి అనసూయ, వాళ్లబ్బాయి సెల్ఫీ దిగారు. 

అద్భుతమైన వ్యక్తి చెర్రీతో దిగిన సెల్ఫీని మీతో షేర్ చేసుకుంటున్నానని కామెంట్స్ చేసింది. అంతేగాకుండా ఓ అద్భుతమైన సన్నివేశాన్ని చిత్రీకరించిన అనంతరం, 'రంగస్థలం' సెట్స్‌లో దిగిన సెల్ఫీ ఇదని అనసూయ చెప్పుకొచ్చింది. కాగా అనసూయ రంగస్థలంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. బుల్లితెర కనిపిస్తూనే సినిమాల్లోకి వచ్చిన అనసూయ.. సచ్చింది గొర్రె అనే చిత్రంలో నటిస్తోంది.