బాహుబలి ఎఫెక్ట్: రాజమౌళికి ఫుల్ సెక్యూరిటీ..
బాహుబలి ఎఫెక్ట్తో రాజమౌళి దశ తిరిగింది. దేశంలోనే ప్రముఖ ఫిల్మ్ మేకర్లలో ఒకడుగా మారిపోయిన రాజమౌళి ఇక పబ్లిక్ ప్రోగ్రామ్లలో పాల్గొనాలంటే.. తప్పకుండా సెక్యూరిటీ ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాడు. బాహుబలి ది బిగినింగ్ ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ అయిన నేపథ్యంలో.. రాజమౌళి నేషనల్ ఐకాన్గా మారిపోయాడు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కంచె ట్రైలర్ రిలీజ్కు రాజమౌళి హాజరు కావడంతో మీడియాతో అందరూ షాక్ తిన్నారు.
ఇంతకీ విషయమేమిటంటే.. రాజమౌళి తన చుట్టూ టైట్ సెక్యూరిటీతో ఈ ప్రోగ్రామ్కు రావడమే. బాహుబలి హిట్ కావడంతో ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడుతున్నారని అందుకే సెక్యూరిటీ ఏర్పరుచుకున్నట్లు రాజమౌళి సన్నిహితులతో వెల్లడించినట్లు సమాచారం. ఎప్పుడూ సాధారణంగా కనిపించే రాజమౌళి ఒక్కసారిగా ఇలా సెక్యూరిటీతో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇకపోతే.. రాజమౌళి బాహుబలి 2 స్క్రిప్ట్ వర్క్ను రెడీ చేసుకోవడంలో బిజీ బిజీగా ఉన్నాడు. ది కన్క్లూజన్ ప్రపంచ స్థాయిలో ఉండాలని, ప్రపంచ అభిమానులను ఆకట్టుకునే విధంగా బాహుబలి 2 ఉంటుందని సమాచారం. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానాలతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు బాహుబలి 2లో ఉంటారని తెలిసింది.