శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 జూన్ 2017 (15:39 IST)

ఇస్తాంబుల్‌లో దోపిడీకి గురైన బాలీవుడ్ బుల్లితెర నటి

బాలీవుడ్ బుల్లితెర నటి సౌమ్య టాండన్ టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నగరంలో దోపిడీకి గురైంది. ఆమె ఎక్కిన క్యాబ్ డ్రైవరే ఈ దోపిడీకి పాల్పడ్డాడు. ఆమెను బెదిరించి ఆమె వద్ద రూ.60 వేలును తీసుకుని పారిపోయాడు. తాజాగ

బాలీవుడ్ బుల్లితెర నటి సౌమ్య టాండన్ టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నగరంలో దోపిడీకి గురైంది. ఆమె ఎక్కిన క్యాబ్ డ్రైవరే ఈ దోపిడీకి పాల్పడ్డాడు. ఆమెను బెదిరించి ఆమె వద్ద రూ.60 వేలును తీసుకుని పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
'భాబీజీ ఘర్ పర్ హై' అనే టీవీ సీరియల్ నటి సౌమ్యా టాండన్ నటిస్తోంది. ఈమె తన స్నేహితులతో కలిసి ఇస్తాంబుల్‌కు విహార యాత్రకు వెళ్లింది. ఆ సమయంలో బయటకు వెళ్లాల్సి రావడంతో క్యాబ్ ఎక్కింది. ఆమెతో క్యాబ్ డ్రైవర్ అమర్యాదగా ప్రవర్తించాడు. అంతేకాకుండా దారి మధ్యలోనే క్యాబ్‌ను ఆపేసి డబ్బులివ్వాలని డిమాండ్ చేశాడు. 
 
మీటర్ ఎందుకు వేయలేదని ఆమె అడగడంతో వాగ్వాదానికి దిగాడు. తర్వాత, అతనితో అనవసరంగా గొడవ ఎందుకు? అని భావించిన ఆమె మూడు యూరోలు తీసి ఇవ్వగా, ఆ కరెన్సీ తమది కాదని చెబుతూ మళ్లీ గొడవకు దిగాడు. అంతే‌కాకుండా ఆమె ఒక్కతే ఉండటంతో ధైర్యంగా ఆమె పర్సులోని 800 యూరోలు (60,000 రూపాయలు) లాక్కొని పారిపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా క్యాబ్ రసీదు లేకపోవడంతో ఏమీ చేయలేమని చేతులెత్తేశారు.