పూరీ జగన్నాథ్ నిజంగానే లోఫర్ అట!
ఇడియట్, పోకిరి, లోఫర్ వంటి టైటిల్స్తో.. సినిమా చేసే పూరీ జగన్నాథ్ నిజంగానే లోఫర్.. పోకిరి అంటూ ఫిలింగనర్లో కామెంట్లు విన్పిస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు. ఇంతకుముందు తాను తీసిన లోఫర్ సినిమా ఫెయిల్ కావడంతో ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు తనను బెదిరించారని.. దర్శకుడు పూరీ జగన్నాథ్ పోలీసు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ ముగ్గురూ.. అసలు ఈ విషయం తమకు తెలీదని.. ఆయన కార్యాలయానికి వెళ్లడం అసాధ్యమని తేల్చారు.
అసలు ఈ వ్యవహారంలో ఉన్నత పోలీసు అధికారి సలహాతో.. పూరీ.. ఇలా కేసుపెట్టాడనీ.. ఏ సెక్షన్ కింద పెడతారంటూ. లా పాయింట్ను ఆ ముగ్గురు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. దానికితోడు. ఆ పోలీసు అధికారిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో.. అసలికో మోసం వస్తుందని కాబోలు.. సదరు పోలీసు అధికారి రాజీకి వచ్చినట్లు తెలిసింది.
దీంతో.. పూరీతోనే చెప్పి కేసు విత్డ్రా చేయించేలా చేసినట్లు తెలిసింది. దాంతో గతంలో తాను ఇచ్చిన.. అభిషేక్ నామా - రామ్ దాస్ నాయుడు - కాళి సుధీర్ లు తనను బెదిరిస్తున్నారంటూ.. పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్ ను పూరి జగన్నాధ్ ఉపసంహరించుకున్నాడు. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ పోలీసు సిఐ. రమేష్ వెల్లడించారు.