రాజమౌళి మోసగాడా...? కోర్టుకు హాజరు కావాలంటూ నాంపల్లి కోర్టు సమన్లు
కొన్ని డీలింగ్స్లో మంచితనానికి పోతే ఏవేవో చిక్కులు వచ్చిపడతాయి. ఆ డీలింగ్లో తప్పెవరదన్నది తెలుసుకోవడం కూడా కష్టమే. ఆ సంగతి అలా వుంచితే బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్.ఎస్ రాజమౌళి మోసగాడంటూ భువనేశ్వర్ అనే సినీ దర్శకుడు రాజమౌళిపై ఫిర్యాదు చేశారు.
ఇంతకీ ఆయన చేసిన మోసం ఏంటంటే... హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని ఫొటోగ్రాఫర్స్ కాలనీలో ఫ్లాట్ను తనకు విక్రయిస్తానని చెప్పి ఎగ్రిమెంట్ చేసుకొని తరువాత మరొకరికి అమ్మారట రాజమౌళి. ఈ కేసు కూడా 2012 నాటిది. అప్పట్లో పోలీసులు రాజమౌళిపై కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది.
ఐతే ఈ విచారణకు రాజమౌళి హాజరు కావడంలేదు. దీంతో సీరియస్ అయిన కోర్టు ఈ నెల 24న వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీనిపై ఎలా ముందుకు పోవాలన్న దానిపై రాజమౌళి న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం.