శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (18:04 IST)

శింబు పాడిన పెద్దనోట్ల పాట వైరల్.. బీజేపీ భయంతో.. పటిష్ట భద్రత (వీడియో)

గతంలో శింబు పాడిన బీప్ సాంగ్ పెను వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ హీరో శింబు పెద్దనోట్ల రద్దుపై పాట పాడారు. ఈ పాట సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో శింబుక

గతంలో శింబు పాడిన బీప్ సాంగ్ పెను వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ హీరో శింబు పెద్దనోట్ల రద్దుపై పాట పాడారు. ఈ పాట సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో శింబుకు బెదిరింపులు వచ్చాయని తమిళనాట ప్రచారం సాగింది. అయితే పాటను వ్యతిరేకిస్తూ.. బెదిరింపులకు పాల్పడేవారిని చూసి తాను జడుసుకునే ప్రసక్తే లేదని శింబు వివరణ ఇచ్చాడు. 
 
ఇప్పటికే 'మెర్సల్' సినిమాలోని డైలాగులతో బీజేపీ నేతలు, సినీ పరిశ్రమ మధ్య మాటల తూటాలు పేలిన నేపథ్యంలో శింబు పాట కూడా వివాదం రేపింది. ఈ పాటను ప్రముఖ రచయిత వైరముత్తు కొడుకు కపిలన్‌ రాయగా, శింబు పాడారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో శింబుకు బెదిరింపులు వచ్చాయని తమిళనాట ప్రచారం సాగింది. 
 
ఈ క్రమంలో శింబు సోషల్ మీడియా మాధ్యమంగా స్పందించారు. తన పాట ప్రజలను ఆకట్టుకుంటోందని తెలిపారు. తనకు ఎవరి నుంచీ బెదిరింపులు రాలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా తనను బెదిరించే ప్రయత్నం చేసినా, తాను బెదిరిపోయే మనిషిని కాదని ఆయన తెలిపారు. తన పాట ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే కనుక క్షమించాలన్నారు.  
 
కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దును నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 8న తట్టురోమ్ తూక్కురోమ్ పేరుతో ఈ పాట విడుదలై తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇందులో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. దీంతో శింబుపై  బీజేపీ తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పాటను బ్యాన్ చేయాలని పట్టుబడుతోంది. కానీ ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే 9,554 మంది వీక్షించారు. అయితే శింబు ఇంటిపై బీజేపీ నేతలు దాడి చేసే అవకాశం ఉండటంతో పోలీసులు హీరో ఇంటికి గట్టి భద్రత ఏర్పాటు చేశారు.