శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (09:24 IST)

విశాల్, ఆర్య హనీమూన్ వెళ్లొచ్చాక చెప్తా.. అప్పుడే నేను చెప్పేది వింటారు...

విశాల్, ఆర్యల పెళ్లిపై.. దేవ్ హీరో కార్తీక్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. విశాల్, ఆర్య పెళ్లి చేసుకుంటున్నారు కదా వారికి ఏమైనా సలహా ఇస్తారా అని అడిగినందుకు కార్తీ వెరైటీగా స్పందించాడు. ముందు వాళ్లను హనీమూన్ ముగించుకుని రానివ్వండి. అప్పుడే కదా తానేం చెప్పినా వారు వింటారు అంటూ.. సెటైర్లు వేస్తూ సమాధానమిచ్చాడు. 
 
కాగా కోలీవుడ్‌లో ప్రస్తుతం ఆర్య, విశాల్ పెళ్లి వ్యవహారంపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. విశాల్, అనీశా జంట, ఆర్య, సాయేషా సైగల్‌ల జంట త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. విశాల్ పెళ్లి త్వరలో జరుగనుంది. ఆర్య, సాయేషా కూడా మార్చిలో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నందున వారికి సలహా లివ్వమని కార్తీని మీడియా ప్రశ్నించింది. 
 
అయితే తాను ఏం చెప్పినా వాళ్లు వినాలంటే వారు ముందు హనీమూన్ వెళ్లి రావాలని కార్తి సెటైరికల్ సమాధానం ఇచ్చారు. ఇకపోతే.. కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం దేవ్ ప్రేమికుల రోజున విడుదల కానుంది.