గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: బుధవారం, 21 జూన్ 2017 (16:00 IST)

హరీష్‌ శంకర్‌కు చిర్రెత్తుకొచ్చింది.. దిల్ రాజు చేతిలో మైకు లాక్కుని...(వీడియో)

దర్శకుడు హరీష్‌ శంకర్‌కు చిర్రెత్తుకొచ్చింది. సర్.... దువ్వాడ జగన్నాథంలో బ్రాహ్మణులను కించపరిచేలా రుద్ర స్తోత్రంలోని పదాలను ఎందుకు పెట్టారు... మళ్ళీ ఎందుకు తీసేశారని మీడియా ప్రశ్నిస్తే హరీష్‌కు చిర్రెత్తుకొచ్చింది. అంతా ముందే అయిపోయాయి. నువ్వు ఏ మీడి

దర్శకుడు హరీష్‌ శంకర్‌కు చిర్రెత్తుకొచ్చింది. సర్.... దువ్వాడ జగన్నాథంలో బ్రాహ్మణులను కించపరిచేలా రుద్ర స్తోత్రంలోని పదాలను ఎందుకు పెట్టారు... మళ్ళీ ఎందుకు తీసేశారని మీడియా ప్రశ్నిస్తే హరీష్‌కు చిర్రెత్తుకొచ్చింది. అంతా ముందే అయిపోయాయి. నువ్వు ఏ మీడియానో నాకు తెలియదు. ఒకసారి కనుక్కో.. నిన్నే ప్రెస్ నోట్లు అన్నీ ఇచ్చేశాము. 
 
పేపర్లు, ఛానళ్ళు అన్నింటినిలో వచ్చేసింది. ఆ పదాలను అప్పుడే తొలగించామంటూ ఒక్కసారిగా మీడియా ప్రతినిధులపై కోప్పడ్డారు హరీష్ శంకర్. ఈ నెల 23వ తేదీన దువ్వాడ జగన్నాథం సినిమా విడుదల కానుండటంతో తిరుపతిలో సినీ యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. మీడియా సమావేశంలో హరీష్‌ శంకర్ సహనం కోల్పోయి ఒక్కసారిగా నిర్మాత చేతిలో నుంచి మైకు లాక్కుని మాట్లాడారు. మీరూ చూడండి.. ఈ వీడియో..