శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2016 (11:16 IST)

డ్రగ్స్ కేసులో అన్యాయంగా ఇరికించారు : మమతా కులకర్ణి

తనను డ్రగ్స్ కేసులో అన్యాయంగా ఇరికించారని బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఆరోపించారు. రూ.రెండు వేల కోట్ల రూపాయల అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కేసులో ఈమె నిందితురాలిగా ఉన్న విషయం తెల్సిందే.

తనను డ్రగ్స్ కేసులో అన్యాయంగా ఇరికించారని బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఆరోపించారు. రూ.రెండు వేల కోట్ల రూపాయల అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కేసులో ఈమె నిందితురాలిగా ఉన్న విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ... తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతోంది. తానొక యోగిని అని, నిర్దోషిని అని చెప్పింది. ‘నేనొక యోగిని. గత 20 ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. డ్రగ్స్ కేసులో నేను నిర్దోషిని’ అని రికార్డు చేసిన వీడియో టేపులో మమత చెప్పింది. ఆమె ప్రస్తుతం కెన్యాలో ఉంటోంది.
 
డ్రగ్స్ కేసులో తన పేరును అక్రమంగా ఇరికించిన మహారాష్ట్ర పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, కిరెన్ రిజిజులకు లేఖ రాసింది. కాగా ఈ కేసులో మమతా కులకర్ణి బ్యాంక్ ఖాతాలను ఇటీవల మహారాష్ట్ర పోలీసులు స్తంభింపజేశారు.