గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2015 (14:03 IST)

గణేశ నిమజ్జన ఉత్సవాల్లో ఐటెమ్ సాంగ్స్ అవసరమా: రేణు దేశాయ్

వినాయక నిమజ్జనం అంటేనే కంటతడి పెట్టేసే పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. మరోసారి గణేశ నిమజ్జనంపై స్పందించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఐటమ్ సాంగ్స్‌తో జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. లౌడ్ స్పీకర్లతో హోరెత్తించారని రేణు దేశాయ్ వ్యాఖ్యానించింది. దీంతో శనివారం రాత్రంతా మా కూతురు ఆద్యకు నిద్రపట్టలేదని రేణు ట్విట్టర్లో పేర్కొంది. 
 
గణేశుడిపై భక్తిని నిరూపించుకోవాలంటే నిమజ్జన ఉత్సవాల్లో ఐటెమ్ సాంగ్స్ అవసరమా అంటూ ఆమె ప్రశ్నించారు. భక్తికి, ఐటెమ్ సాంగ్స్ కి ఏమైనా సంబంధముందా అంటూ రేణు దేశాయి కామెంట్ చేశారు.
 
ఇదిలా ఉంటే.. వినాయక నిమజ్జనం అంటేనే ఏడుపొచ్చేస్తుందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్‌ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం చేసే సమయంలో తన కళ్లంతా నీటితో నిండిపోతాయంది. అయితే ఈ సంవత్సరం తనకు తోడుగా ఆకాశం కూడా కన్నీరు పెట్టిందని రేణుదేశాయ్ ట్వీట్ చేసింది.