గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 మార్చి 2017 (17:49 IST)

జబర్ధస్త్: రష్మీని ఎక్కువ చేయకన్న గెటప్ శీను.. నాగబాబు, రోజాను కూడా అలా అనేశాడు..

జబర్ధస్త్ కామెడీ షోకు యమా క్రేజున్న సంగతి తెలిసిందే. ఈ షోలో మంచి కంటెంట్ మిస్సయ్యింది. బూతు కంటెంట్‌తో స్కిట్‌ ఎక్కువైపోయిందని విమర్శలు వస్తున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులతో బూతు కామెడీ ఎక్కువైందని సిన

జబర్ధస్త్ కామెడీ షోకు యమా క్రేజున్న సంగతి తెలిసిందే. ఈ షోలో మంచి కంటెంట్ మిస్సయ్యింది. బూతు కంటెంట్‌తో స్కిట్‌ ఎక్కువైపోయిందని విమర్శలు వస్తున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులతో బూతు కామెడీ ఎక్కువైందని సినీ విశ్లేషకులే కాదు సామాన్య ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. ఈ షోలో పాల్గొనే నటులపై ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. 
 
తాజాగా 31 మార్చి 2017లో ప్రసారం కానున్న ఎక్స్‌ట్రా జబర్ధస్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో తొలుత సుడిగాలి సుధీర్‌కు చెందిన స్కిట్ వచ్చింది. ఈ స్కిట్‌లో సుధీర్, రామ్ ప్రసాద్‌తో ఆ అమ్మాయికి లవ్‌లెటర్ ఇచ్చానంటాడు. ఇంతలో గెటప్ శీను ఎంటరిచ్చి.. ఎవడ్రా నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చిందని అడుగుతాడు. సుధీర్ స్పందిస్తూ.. నీ కూతురికి లవ్ ఎవరిచ్చారు.. ఇచ్చింది మీ ఆవిడకంటూ సమాధానం చెప్తాడు. కానీ ఈ స్కిట్ వివాదానికి దారితీసింది. 
 
స్కిట్ పూర్తయ్యాక యాంకర్ రష్మీ అక్కడకు వచ్చి ఇదేం స్కిట్ అని ప్రశ్నించింది. దీంతో గెటప్ శీను రష్మీని ఎక్కువ చేయకు అన్నాడు. అంతే నాగబాబుకు కోపమొచ్చింది. ఈ మధ్య మీ టీమ్‌కు పొగరు, అహం ఎక్కువైందన్నారు. వెంటనే గెటప్ శీను నాగబాబు, రోజాలనుద్దేశించి మీరు స్కిట్ చేయండి అని పొగరుగా సమాధానం ఇచ్చాడు. దీంతో దీన్ని ఇష్యూ చేయాలనుకుంటున్నారా.. అసలు ఏంటీ మీ ఉద్దేశ్యం అంటూ.. అవుట్ ఆఫ్ మై సైట్ అని వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఈ వివాదం వ్యూస్ పెంచేందుకేనని సినీ విశ్లేషకులు, నెటిజన్లు అంటున్నారు.