గోపీచంద్ - సంపత్ నంది చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి....
మాస్ యాక్షన్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ హిట్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ర
మాస్ యాక్షన్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ హిట్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా సినిమా బ్యాంకాక్లో జరిగిన భారీ తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో 70 మంది నటీనటులు పాల్గొనగా 30 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. అద్భుతమైన బ్యాంకాక్ లోకేషన్స్లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
దీనిపై చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ``మొదటి షెడ్యూల్ చిత్రీకరణ అనుకున్న ప్లానింగ్లో చక్కగా పూర్తయ్యింది. దర్శకుడు సంపత్ నంది, సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ తెరకెక్కించిన విజువల్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో చిత్రీకరించిన ప్రీ క్లైమాక్స్ సీన్స్, బ్యాంకాక్ బ్రిడ్జ్పై హెలికాప్టర్తో చిత్రీకరించిన భారీ కార్ చేజింగ్ సీన్ చాలా బాగా వచ్చాయి.
అలాగే రిచ్నెస్ కోసం సినిమాను బ్యాంకాక్లోని ప్రముఖ బార్స్, పబ్స్లో చిత్రీకరించాం. ఫ్యామిలీ సన్నివేశాలు, క్యాథరిన్ ఇంట్రడక్షన్ సన్నివేశం, విలన్కు సంబంధించిన సన్నివేశాలను, తనికెళ్ళ భరణి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరికొత్త లుక్లో కనపడతారు. ఎంజాయ్ చేసేలా ప్రతి సన్నివేశాన్ని రిచ్లుక్తో రూపొందిస్తున్నాం`` అన్నారు.
ముఖేష్ రుషి, సచిన్ కేడేఖర్, నికితన్ ధీర్(తంగబాలి), అజయ్, వెన్నెల కిషోర్ ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, కో డైరెక్టర్: హేమాంబర్ జాస్తి, ఆర్ట్: కడలి బ్రహ్మ, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎడిటర్: గౌతంరాజు,సంగీతం: ఎస్.ఎస్.థమన్, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సంపత్ నంది.