ఈ రోజు నుంచి ఆ సీన్ను తొలగిస్తున్నాం... గుంటూరు టాకీస్ దర్శక నిర్మాతలు
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ ప్రవీణ్సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుంటూర్ టాకీస్’ ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, నరేష్ విజయ్కృష్ణ, రేష్మీ గౌతమ్, శ్రద్ధాదాస్, లక్ష్మీ మంచు, మహేష్ మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్పై రాజ్కుమార్.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మార్చి 4న గ్రాండ్ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ను సాధించింది.
అయితే ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో వికలాంగులను కించపరిచేలా ఓ సన్నివేశం ఉందని తెలంగాణ వికలాంగుల సంఘం సినిమాపై కేసు వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ వికలాంగుల అధ్యక్షుడు వెంకన్న నిరసనను తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై గుంటూరు టాకీస్ దర్శక నిర్మాతలు స్పందిచడమే కాకుండా సినిమాలో క్యారెక్టర్ను అనుసరించి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించామే తప్ప ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం మాకు లేదు. అందువల్ల ఆ సన్నివేశాన్ని ఈ రోజు నుండి సినిమాలో తొలగిస్తున్నాం అని గుంటూరు టాకీస్ దర్శక నిర్మాతలు తెలియజేశారు.