హెబ్బానే చేసుకునేది నాల్గవ వాడే....
నటి హెబ్బాపటేల్ నటించిన 'నేను నాన్న నా బాయ్ఫ్రెండ్స్' సినిమా ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. ముగ్గురు బోయ్ఫ్రెండ్స్ను ఎలా మెయిన్టైన్ చేస్తున్నావని అడిగితే రియల్ లైఫ్లోనా? రీల్ లైఫ్లోనా అంటూ రియల్ లైఫ్లో ఎవ్వరూ లేరని చెప్పింది. రీల్ లైఫ్ల
నటి హెబ్బాపటేల్ నటించిన 'నేను నాన్న నా బాయ్ఫ్రెండ్స్' సినిమా ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. ముగ్గురు బోయ్ఫ్రెండ్స్ను ఎలా మెయిన్టైన్ చేస్తున్నావని అడిగితే రియల్ లైఫ్లోనా? రీల్ లైఫ్లోనా అంటూ రియల్ లైఫ్లో ఎవ్వరూ లేరని చెప్పింది. రీల్ లైఫ్లో మాత్రం ముగ్గురు వున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా టైమ్పాస్ ఫ్రెండ్స్... ఒక అ మ్మాయి వెంటపడి యూత్ తమ కెరీర్ను ఎలా నాశనం చేసుకుంటున్నారో.. అని చెబుతూ.. చివర్లో ఓ నీతిని చెప్పబోతోంది.
ఆ నీతిని ఓ ప్రముఖ హీరో చేత చెప్పించనున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాత బెక్కెం వేణు గోపాల్ను ఈ విషయమై ప్రశ్నిస్తే... సినిమా చూశాక మీరే చెప్పండంటూ దాట వేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో క్లైమాక్స్లో హీరో రాజ్ తరుణ్ వస్తాడు. హెబ్బాను తీసుకెళ్ళిపోతాడు. ఇక ముగ్గురు బోయ్ఫ్రెండ్స్ అవాక్కవుతారు. ఈ ముగింపు చాలా ఆసక్తికరంగా వుంటుందని తెలుస్తోంది. ఇంతకుముందు రాజ్తరుణ్.. మజ్ను' సినిమాలో ఇలాగే చివర్లో గెస్ట్గా కన్పించాడు.