విశాల్ అత్యవసర సమావేశం... సూర్య, కార్తీలు కూడా మద్దతు...
నటుడు విశాల్ బుధవారం సాయంత్రం మీడియాతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. తమిళ నడిగర్ సంఘం ఎన్నికలు కొద్దిరోజుల్లో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటికే బాధ్యతలు నిర్వహిస్తున్న శరత్కుమార్ వర్గం కొన్ని అవకతవకలు చేసిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. దాని గురించి విశాల్ వారిని ప్రశ్నించాడు.
తన పుట్టినరోజు, తన తల్లి పుట్టినరోజు ఇలా ఏదో కార్యక్రమంలో మద్రాసు అంతా తిరుగుతూ.. అక్కడ సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. విశాల్కు సూర్య, కార్తి, నాజర్తో పాటు పలువురు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఆ కోవలో ఖుష్బూ కూడా చేరింది. ఖుబ్బూకు అక్కడ అంతోఇంతో పేరుంది.
గతంలో శరత్కు మద్దతు ఇచ్చిన ఈమె ఈసారి విశాల్ ఇవ్వడంపై వ్యాఖ్యానిస్తూ... యువతరం ఈ రంగంలోకి రావాలి. చాలా మంచి పనులు చేయాలని స్టేట్మెంట్ ఇచ్చింది. సంఘం నిధులు దుర్వినియోగం చేయడమే కాకుండా శివాజీ గణేశన్ విగ్రహం గురించి ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదని విశాల్ ప్రశ్నిస్తున్నారు.