గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 16 అక్టోబరు 2016 (16:37 IST)

పాక్ ఇష్యూ: రాజకీయ నాయకుల్ని, వైద్యుల్ని ఎందుకు టార్గెట్ చేయరు?: ప్రియాంకా చోప్రా

భారత్-పాకిస్థాన్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూరీ ఘటన, సర్జికల్ స్ట్రైక్స్‌కు తర్వాత పాకిస్థాన్ అంటేనే ఎవరికీ పడట్లేదు. ఉరీ ఘటన అనంతరం భారత్-పాక్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహార

భారత్-పాకిస్థాన్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూరీ ఘటన, సర్జికల్ స్ట్రైక్స్‌కు తర్వాత పాకిస్థాన్ అంటేనే ఎవరికీ పడట్లేదు. ఉరీ ఘటన అనంతరం భారత్-పాక్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన భారత్‌లో ఉంటున్న పాక్‌ నటీనటులను దేశం వదిలి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
 
పాక్ నటులు దేశం విడిచిపోవాలనే అంశంపై తాజాగా గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా స్పందించారు. ప్రస్తుతం 'క్వాంటికో సీజన్‌-2' సిరీస్‌ షూటింగ్‌ నిమిత్తం న్యూయార్క్‌లో ఉన్న ప్రియాంక తన అభిప్రాయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పాక్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సబబేనని చెప్పింది.

తనకు దేశభక్తి ఉందని చెప్పింది. కానీ ఈ వ్యవహారంలో కేవలం నటీనటులను ఎందుకు టార్గెట్ చేయాలని ప్రశ్నించింది. దేశంలో ఏం జరుగుతుందో అంతా తెలుసు. కానీ రాజకీయంగా ఎలాంటి ఘటనలు జరిగినా లక్ష్యం చేసేది నటీనటులు, కళాకారులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అడిగింది. 
 
వ్యాపారవేత్తలని, రాజకీయ నాయకులని, వైద్యులని ఎందుకు వేలెత్తి చూపరు? భారత్‌ తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటాను. కానీ ఈ విషయంలో పాక్‌ నటీనటులు ఎవరికీ ఎలాంటి హానీ కలిగించలేదు. అలాంటప్పుడు వారికి వ్యతిరేకంగా ఉండలేం కూడా అంటూ ప్రియాంక  చోప్రా వ్యాఖ్యానించారు. ఒకరు చేసిన పనికి వారినే శిక్షించాలి కానీ, వారి స్థానంలో కళాకారులని శిక్షించాలనుకోవడం తప్పు అని ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించింది. 
 
జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను పాటిస్తున్నామని.. అహింసకు కట్టుబడి ఉంటామని ప్రియాంక చోప్రా తెలిపింది. సైనికులకు, వారి కుటుంబాలకు భద్రత కల్పించడంపై మనం శ్రద్ధ వహించాలి. నిర్వర్తించాల్సిన బాధ్యత గురించి మరిచిపోయి అనవసరమైన వాటిపై ఎక్కువగా చర్చిస్తుంటామని అభిప్రాయాలను తెలిపింది.