బాహుబలి 2 తర్వాత ఈగ 2 కూడా: భారతంలో తప్పకుండా నాని!?
ఇటీవలే హాలీడే టూర్ వెళ్ళి వచ్చిన రాజమౌళి తాజాగా మరోసారి వెళ్ళారు. బాహుబలి అర్థశతదినోత్సవాన్ని అక్కడ తన ఫ్యామిలీతో చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా 600 కోట్ల గ్రాస్ మార్క్ని క్రాస్ చేసింది. ఇప్పటికీ చాలా ఏరియాల్లో రిపీట్ ఆడియన్స్ని థియేటర్స్ను రాబట్టుకుంటోంది. ముఖ్యంగా ఐమాక్స్ 3డి స్క్రీన్పై చూసేందుకు ఇప్పటికీ టిక్కెట్ బుకింగ్ చేసుకోవడం విశేషం.
కాగా, ప్రస్తుతం సెకండ్ పార్ట్ కోసం రాజమౌళి వర్క్ మొదలు పెట్టాడు. తాజాగా వరుణ్తేజ్ నటించిన కంచె ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి ఇండోనేషియాలోని బాలి అనే దీవికి హాలిడేకి వెళ్ళారు. అక్కడ కొద్ది రోజులు ఫ్యామిలీతో కలిసి హాలిడేని బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చాక ఫుల్ ప్లెడ్జ్గా బాహుబలి 2 వర్క్ని మొదలు పెట్టనున్నారు.
అయితే.. బాహుబలి 2 తర్వాత ఈగ 2 కూడా చేయాలనే ఆలోచన రాజమౌళికి వుందట. ఈ విషయాన్ని నాని వెల్లడించాడు. అయితే అందులో తాను వుంటానో లేనో కూడా చెప్పలేనని... కానీ భారతంలో మాత్రం తప్పకుండా వుంటానని పేర్కొన్నాడు.