శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 జనవరి 2017 (17:59 IST)

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ట్రిపుల్ రోల్‌లో తారక్.. ఫిబ్రవరి 10న ముహూర్తమ్..

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. జనతా గ్యారేజ్‌కు తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందా అని ఆత్రుతతో ఎదురుచూసే నందమూరి ఫ్యాన్స్‌ ఇక పండగ చేసుకోవచ్చు. కొత్త సినిమాకు ఫిబ్రవరి 10న ముహూర్తం ఫిక్స్ అ

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. జనతా గ్యారేజ్‌కు తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందా అని ఆత్రుతతో ఎదురుచూసే నందమూరి ఫ్యాన్స్‌ ఇక పండగ చేసుకోవచ్చు. కొత్త సినిమాకు ఫిబ్రవరి 10న ముహూర్తం ఫిక్స్ అయ్యిందని.. అదే నెల ఫిబ్రవరి 15న సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు నిర్మాత కళ్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరడంతో లాంఛింగ్ మొదలుపెట్టి, సెట్స్‌పైకి వెళ్లాలని భావిస్తున్నారు.  నందమూరి ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌కి రవీందర్ (బాబి) దర్శకత్వం వహిస్తున్నాడు.  
 
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారిగా ట్రిపుల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అదుర్స్‌లో డబుల్స్ రోల్స్‌తో అదరగొట్టిన తారక్.. ట్రిపుల్‌లోనూ అదే రీతిలో ఇరగదీస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కామెడీ, యాక్షన్, నెగటివ్ షేడ్స్ గల పాత్రల్లో ఎన్టీఆర్ కనిపిస్తాడని తెలిసింది. 
 
ఇంతవరకు ఓకే.. ఎన్టీఆర్ పక్కన హీరోయిన్స్ ఎవరన్నది సస్పెన్స్. తొలుత కాజల్, అనుపమ పరమేశ్వరన్, అనూ ఇమ్మాన్యుయేల్, నివేదా థామస్ పేర్లను పరిశీలించినప్పటికీ, రాశిఖన్నా ఓకే అయ్యిందని.. మరో ఇద్దరి కోసం వేట జరుగుతున్నట్లు సమాచారం. మరో ఇద్దరు ఎవరనేది తెలియాల్సివుంది. ఈ సినిమా ఎన్టీఆర్‌కు 27వ సినిమా కానుంది.