మణిరత్నం, కార్తీ కాంబినేషన్
కార్తీ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో 'కాట్రు వెలియిదై' చిత్రం తెరకెక్కుతోంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగు దశలో వుంది. కార్తీ జోడీగా అదితి రావు నటిస్తోంది. రెండో షెడ్యూల్ను కాశ్మీర్లో జరిపారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన
కార్తీ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో 'కాట్రు వెలియిదై' చిత్రం తెరకెక్కుతోంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగు దశలో వుంది. కార్తీ జోడీగా అదితి రావు నటిస్తోంది. రెండో షెడ్యూల్ను కాశ్మీర్లో జరిపారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు.
ఇక మూడవ షెడ్యూల్ను నేటి నుంచి చెన్నైలో ఆరంభించనున్నారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. 'ఓకే బంగారం' తరువాత మణిరత్నం చేస్తోన్న సినిమా కావడంతో, అభిమానులు ఈ సినిమా పట్ల ఎంతో ఆత్రుతో వున్నారు.