'కబాలి' నాకు ఎంతో ఆనందాన్ని మిగిల్చింది.. నేనెప్పటికీ మరిచిపోలేను: నిర్మాత కలైపులి ఎస్ థాను
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కబాలి' చిత్రం తనకు ఎంతో ఆనందాన్ని మిగిల్చిందని ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్. థాను చెప్పుకొచ్చారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కబాలి' చిత్రం తనకు ఎంతో ఆనందాన్ని మిగిల్చిందని ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్. థాను చెప్పుకొచ్చారు. ఈ చిత్రం భారీ విజయంపై ఆయన స్పందిస్తూ.. కబాలి మిగిల్చిన ఆనందాన్ని.. ఈ రోజులను ఈరోజులను నేనెప్పటికీ మరవలేను అని వ్యాఖ్యానించారు.
ఈ చిత్రం కలెక్షన్లపై ఆయన స్పందిస్తూ.. వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లని, ఇందులో కేవలం అమెరికాలోనే రూ.28 కోట్లు వసూలయ్యాయని తెలిపారు. ఇక భారత్లోని తొలి మూడురోజుల్లో దాదాపు రూ.100 కోట్లు వసూలు చేశాయని చెప్పారు. కాగా, ఈ సినిమా ఇప్పటికే రూ.400 కోట్లు రాబట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన స్పందించడం లేదు.