శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: గురువారం, 4 జులై 2019 (19:22 IST)

రాత్రికి 'రాజీ'కి వస్తావా అంటూ మెసేజ్‌లు పంపేవారంటున్న నటి...

కాస్టింగ్ కౌచ్. దీనిపై ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీల్లో దుమారం రేగిన సంగతి తెలిసిందే. తమను లొంగదీసుకుంటున్నారంటూ చాలామంది తారలు మీడియా ముందుకు వచ్చారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమకు ఎలాంటి వేధింపులు గురయ్యాయో వివరించి చెప్పారు. ఇంకా ఈ ఉద్యమం అలా సాగుతూనే వుంది. ఈ క్రమంలో మరో నటి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.
 
మలయాళీ నటి గాయత్రి సురేష్ కాస్టింగ్ కౌచ్ పైన సంచనల వ్యాఖ్యలు చేసింది. సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తల్లో తను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో కొందరు రాత్రికి రాజీకి వస్తావా అంటూ ఫోన్ సందేశాలు పంపేవారంటూ వెల్లడించింది. ఐతే అలా పంపించినవారు ఎవరన్నది మాత్రం బయటకు చెప్పలేదు. కానీ తనకు అలాంటి సందేశాలను పంపినవారందరికీ నో అని చెప్పానంటూ వెల్లడించింది. 
 
కాంప్రమైజ్ కాకుండానే ఇండస్ట్రీలో పైకి రావాలని పట్టుదల పట్టానని చెప్పింది. ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేనివారికి ఈ వేధింపులు మరీ ఎక్కువగా వుంటాయనీ, ఇండస్ట్రీకి చెందినవారికి ఇలాంటి చేదు అనుభవాలు తక్కువగా వుంటాయంటూ చెప్పుకొచ్చింది.