గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (14:29 IST)

బాబాయ్‌ పవన్‌కి చెర్రీ ధన్యవాదాలు: ఎన్టీఆర్, మహేష్‌లకు చెర్రీ చాలా క్లోజ్.. అఖిల్ ఐతే?: చిరు

ఖైదీ నెంబర్ 150 ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో ఈవెంట్‌కు మెగాహీరోలందరూ హాజరైయ్యారు. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం.. వేదికకు దూరంగా ఉండిపోయారు. కానీ వేడుకకు ముందు ట్విట్టర్‌ ద్వ

ఖైదీ నెంబర్ 150 ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో ఈవెంట్‌కు మెగాహీరోలందరూ హాజరైయ్యారు. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం.. వేదికకు దూరంగా ఉండిపోయారు. కానీ వేడుకకు ముందు ట్విట్టర్‌ ద్వారా రామ్‌చరణ్‌కు, వదిన సురేఖకు శుభాకాంక్షలు తెలియజేశాడు. 
 
పవన్‌ హాజరుకాకపోవడంపై మీడియా, అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నప్పటికీ చిరంజీవి, రామ్‌చరణ్‌ మాత్రం పాజిటివ్‌ కామెంట్లే చేస్తున్నారు. కేవలం బిజీగా ఉండడం వల్లే పవన్‌ రాలేకపోయాడని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం చెర్రీ కూడా బాబాయ్‌కి వత్తాసు పలికాడు. ఇందులో భాగంగా చెర్రీ సోషల్‌ మీడియా ద్వారా పవన్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు. తమకు శుభాకాంక్షలు చెబుతూ పవన్‌ చేసిన ట్వీట్‌కు రామ్‌చరణ్‌ ధన్యవాదాలు తెలియజేశాడు.
 
ఇదిలా ఉంటే.. అభిమానులు, బయటివాళ్లు ఎలా అనుకుంటున్నా సినిమా వాళ్లంతా ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉంటారని మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తోటి హీరోలతో తనకు మంచి అనుబంధం ఉందని.. ఈ సంక్రాంతికే విడుదలవుతున్న 'గౌతమిపుత్రశాతకర్ణి' సినిమా ప్రారంభోత్సవానికి తాను వెళ్లానని గుర్తు చేశారు.
 
అలాగే నాగార్జున, వెంకటేష్‌లతోనూ తనకు మంచి అనుబంధముందని చిరంజీవి వెల్లడించారు. తనలాగానే రామ్‌చరణ్‌ కూడా తోటి కథానాయకులందరితోనూ స్నేహంగా ఉంటాడన్నారు. మహేష్‌ బాబుకి చెర్రీ చాలా క్లోజ్ అని, వారి ఫ్యామిలీతో ఫ్యామిలీ ట్రిప్ కూడా వెళ్లాడని చిరంజీవి అన్నారు. ఇక ఎన్టీఆర్‌కు కూడా చెర్రీ మంచి ఫ్రెండ్ అని తెలిపారు. అఖిల్‌ అయితే చరణ్‌తో టైమ్‌ స్పెండ్‌ చేసేందుకు ఇంటికి వస్తుంటాడని అన్నారు.