ఫేస్బుక్ ద్వారా 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' టీజర్ రిలీజ్.. శునకాల్ని కిడ్నాప్ చేసేస్తాడట..
రాజ్తరుణ్ హీరోగా వస్తున్న చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. ఈ చిత్ర టీజర్ను ఆదివారం రాజ్తరుణ్ తన ఫేస్బుక్ ద్వారా విడుదల చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, వంశ
రాజ్తరుణ్ హీరోగా వస్తున్న చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. ఈ చిత్ర టీజర్ను ఆదివారం రాజ్తరుణ్ తన ఫేస్బుక్ ద్వారా విడుదల చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మనుషులను కిడ్నాప్ చేయడం కంటే శునకాలను కిడ్నాప్ చేయడమే ఈజీ అని రాజ్తరుణ్ చెప్తున్నాడు.
'శునకాలు ఉన్నాయి జాగ్రత్త' అని బోర్డు పెట్టి ఇల్లు కనబడిందంటే చాలు.. అక్కడ ఉన్న శునకాలను ఈ కిట్టు కిడ్నాప్ చేసేస్తాడంట.ఈ చిత్రంలో శునకాల దొంగ కిట్టుగా రాజ్తరుణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మజ్ను చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ముద్దుగుమ్మ అను ఇమ్మానుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.