శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (16:11 IST)

ఇళయరాజాని అడిగితే బెటర్... నేనైతే నోటీసులు పంపేవాడిని కాదు : కేజే. ఏసుదాస్

సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం - సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంపై కామెంట్స్ చేసేందుకు ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఏసుదాస్ నిరాకరించారు. ఈ వ్యవహారంపై ఇళయరాజానే అడగాలంటూ మీడియా మిత్రులకు సలహా ఇ

సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం - సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంపై కామెంట్స్ చేసేందుకు ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఏసుదాస్ నిరాకరించారు. ఈ వ్యవహారంపై ఇళయరాజానే అడగాలంటూ మీడియా మిత్రులకు సలహా ఇచ్చారు. 
 
ఎస్పీబీ, ఇళయరాజాల వ్యవహారం లీగల్ నోటీసు వరకు వెళ్లిన విషయం తెల్సిందే. దీనిపై కేజే యేసుదాస్‌ వద్ద ప్రస్తావించగా 'నేనయితే ఎవ్వరికీ అలా లీగల్ నోటీసులు పంపేవాణ్ణి కాదు. నన్ను అడగడం కన్నా ఇళయరాజాని అడిగితే బెటర్,' అని తన అభిప్రాయం చెప్పారు. 
 
అలాగే, జాతీయ అవార్డుల విషయంలో తమిళ దర్శకుడు మురుగదాస్, మరికొందరు చేసిన కామెంట్స్‌పై ఆయన స్పందిస్తూ... 'ఈ సందేహం ఎవరైతే వ్యక్తపరిచారో వాళ్లనే అడగడం మంచిది. లేదంటే, జ్యూరీని అడగాలి. అంతేకానీ, సంబంధంలేని నాలాంటి వాళ్ళని అడగడం కరెక్ట్ కాదు,' అని చెప్పారు.