శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: ఆదివారం, 4 అక్టోబరు 2015 (19:44 IST)

'కుమారి 21 ఎఫ్‌' టీజర్‌కు మహేష్ బాబు ప్రశంసలు

ప్రముఖ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారుతూ నిర్మిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్’. ఆయన సమర్పిస్తూ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హేబా పటేల్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ టీజర్‌ను శుక్రవారం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
 
కాగా ఈ టీజర్‌కు మహేష్‌ బాబు తన ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. ‘కుమారి 21 ఎఫ్’ టీజర్ చాలా ఇంప్రెసివ్‌గా వుంది. రత్నవేలు ఛాయాగ్రహణం, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి వన్నెతెచ్చాయి. సుకుమార్ టీమ్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నాను’ అని తెలిపారు మహేష్‌బాబు. గతంలో సుకుమార్-మహేష్ కలయికలో ‘వన్’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.