మహేష్ బాబు ఆ సెంటిమెంట్తోనే వచ్చాడట... అంతా నాగ్ ప్లాన్...
ఇటీవలే మహేష్ బాబు.. నాగార్జున కొడుకు అఖిల్ సినిమా ఆడియోకు చీఫ్ గెస్ట్గా అటెండయ్యాడు. దీనికి యూత్ హీరోల్లో వున్న ఐక్యత కారణంగా చెప్పుకున్నారు. కానీ అసలు కారణం మరోటి వుందని తెలుస్తోంది. ఫ్లాష్బ్యాక్లోకి వెళితే... మహేష్ హీరోగా పరిచయం అయిన తొలి సినిమా 'రాజకుమారుడు'. దానిపై కృష్ణ అభిమానులు భారీ అంచనాలే వేసుకున్నారు.
ఆ సినిమా ఆడియోకు చీఫ్ గెస్ట్గా అక్కినేని నాగార్జున వచ్చాడు. దాదాపు 16 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన. ఇప్పుడు మహేష్ బాబు పెద్ద స్టార్ అయ్యాడు. అప్పుడు నాగార్జున స్టార్.. అందుకే తన కొడుకు ఫంక్షన్కు మహేష్ బాబు వచ్చేలా ప్లాన్ చేశాడు. అందుకు కృష్ణ కుటుంబం కూడా హ్యాపీగా ఫీలయింది. ఇది యాదృశ్చికమైనా.. ఇరు కుటుంబాల్లో మంచి వాతావరణ నెలకొని వుంది.