జూ.ఎన్టీఆర్ "జనతా గ్యారేజ్"లో ప్రిన్స్ మహేష్ బాబు!
జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందు ఓ హాట్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదే 'జనతా గ్యార
జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందు ఓ హాట్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదే 'జనతా గ్యారేజ్'లో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు అడుగుపెట్టాడట. అవును. ఇది పచ్చినిజం.
అవును.. మీరు చదివింది నిజమే. మహేష్ అడుగుపెట్టింది 'జనతా గ్యారేజ్' సెట్లోనికి మాత్రమే. మహేష్ బాబు - మురుగాదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఇప్పటివరకు చెన్నైలో జరుపుకుంది.
ఈ చిత్రం తదుపరి చిత్రీకరణ కోసం యూనిట్ అంతా హైదరాబాద్కు ప్యాకప్ అయింది. ఈ షెడ్యూల్లో భాగంగా 'జనతా గ్యారేజ్' కోసం హైదరాబాద్ సారథి స్టూడియోలో వేసిన సెట్లోనే కొన్ని సీన్లు చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ సెట్లో ఓ ఫైట్ను, ఓ పాటను దర్శకుడు చిత్రీకరించనున్నాడట. అందుకు తగ్గట్టుగా సెట్లో చిన్నచిన్న మార్పులు కూడా చేయించినట్టు చిత్ర యూనిట్ వర్గాల సమాచారం.