శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 జులై 2015 (13:08 IST)

మందుబాబులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మంచు లక్ష్మీప్రసన్న రెడీ

హైదరాబాద్ రోడ్లపై డ్రంకన్ డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో.. మందుబాబులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు బుల్లితెరపైనా, వెండితెరపైనా బిజీబిజీగా ఉన్న మంచు లక్ష్మీప్రసన్న రెడీ అంటోంది. ఇటీవలి కాలంలో సోదాలు ముమ్మరం చేసిన పోలీసులు పెద్ద సంఖ్యలో డ్రంకన్ డ్రైవర్లను పట్టుకుంటున్నారు. అమల్లో ఉన్న చట్టాల కారణంగా వీరికి చిన్నపాటి ఫైన్‌తోనే సరిపెట్టాల్సి వస్తోంది.
 
అయితే ఎన్ని సోదాలు చేసినా డ్రంకన్ డ్రైవ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి చెక్ పెట్టే దిశగా కౌన్సిలింగ్ ఆయుధమే బెస్ట్ అని డిసైడ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు సెలబ్రిటీని రంగంలోకి దించాలనుకున్నారు. అప్పుడే పోలీసుల మదిలో మంచు లక్ష్మీప్రసన్న పేరు గుర్తుకొచ్చిందట.
 
సామాజిక స్పృహతో పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆమెను పోలీసులు సంప్రదించారు. ఇందుకు లక్ష్మీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే మందుబాబులకు ఆమెతో కౌన్సిలింగ్ ఇప్పించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.