శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 3 మే 2018 (16:10 IST)

విడుదలకు ముందే రూ.కోట్లు కొల్లగొట్టిన "నా పేరు సూర్య"

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - వక్కంతం వంశీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈ చిత్రం శుక్రవారం (మే 4వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - వక్కంతం వంశీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈ చిత్రం శుక్రవారం (మే 4వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌ కాగా, సీనియర్ సినీ నటులు అర్జున్, శరత్ కుమార్‌లు కీలక పాత్రను పోషించారు. అలాగే, ఠాకూర్ అనూప్ సింగ్ ప్రతినాయకుడిగా నటించారు. సరిహద్దుల్లో సేవ చేసే సైనికుడి పాత్రలో అల్లు అర్జున్ ఇందులో పోషించారు.
 
అయితే, ఈ చిత్రం విడుదలకాకముందే కోట్లాది రూపాయలను వసూలు చేసింది. సినిమా ప్రీరిలీజ్ బిజినెస్‌ వివరాలను పీఆర్వో వంశీ శేఖర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ సినిమాకు నైజాంలో రూ.21 కోట్లు, విశాఖలో రూ.8 కోట్లు, సీడెడ్‌లో రూ.12 కోట్లు, యూఎస్‌లో రూ.7 కోట్లు, మిగతా దేశాల్లో రూ.2 కోట్లు, కేరళలో రూ.3 కోట్లు, బెంగళూరులో రూ.9 కోట్లు, గుంటూరులో రూ.5.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.4.2 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.5.4 కోట్లు, నెల్లూరులో రూ.2.52 కోట్లు, కృష్ణాలో రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.85.87 కోట్ల బిజినెస్ జరిగిందని తెలిపారు.