'నాన్నకు ప్రేమతో...' విడుదలకు ముందు సుకుమార్కు శూన్యం కనబడిందట....
దర్శకుడు సుకుమార్.. '1'.. సినిమా మహేష్తో తీసినప్పుడు పెద్దగా ఆడకపోయినా.. స్టెయిలిష్ సినిమా తీశావని చాలామంది మెచ్చుకున్నారు. అందులో ఎన్టిఆర్ మొదటివాడు. అప్పటికి ఆయను హిట్లు లేవు. ఆ తర్వాత ఎన్టిఆర్తో 'నాన్నకు ప్రేమతో' తీశాడు. కానీ.. సినిమా అనుకున్న టైంకు రావడానికి ఎంత టెన్షన్ పడ్డాడో దేవుడికే తెలుసు.
రాత్రింబవళ్లూ ల్యాబ్లో వుంటూ ఆ పనులు పర్యవేక్షించిన ఆయనకు నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. తెల్లవారుజామున నిద్ర వచ్చేది. ఆ నిద్రలో కూడా సినిమా గురించే వచ్చేదట. అలా వచ్చిన కలలో ఓసారి అంతా శూన్యమే కన్పించిందట. దాంతో కంగారుపడిన ఆయన తన టీమ్తో దీని గురించి చర్చించాడు.
సినిమా రెండు రోజుల్లో విడుదల వుందనగా.. ఆ టెన్షన్ మామూలుగా లేదు. సినిమా హిట్ అవుతుందా? కాదా? అనే సందిగ్దంలోనే అందరితో పంచుకున్నాడట. విడుదల రోజు పూజగదిలో కూర్చుని తన ఇష్టదైవాన్ని మొక్కుకున్నాడు. ఎట్టకేలకు సినిమా బాగానే ఆడి.. కలెక్షన్లు బాగా రావడంతో మొక్కును తిరుమలలో తీర్చుకోనున్నాడట. అప్పటి టెన్షన్ ఇప్పుడు తీరిందని చెబుతున్నాడు.