ప్రేమమ్ తెలుగు రీమేక్ మజ్ను నాగచైతన్యకు మూడో హీరోయిన్గా ఐషాశర్మ..!
ప్రేమమ్ తెలుగు రీమేక్కు సంబంధించిన పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్లు ఈ మూవీ కోసం ఎంపికయ్యారు. తాజాగా మూడో హీరోయిన్గా ఐషాశర్మ సెలెక్ట్ అయ్యింది. మలయాళంలో 'ప్రేమమ్' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా, యూత్ను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ ప్లాన్ చేసింది.
ఈ క్రమంలో చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. కథ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ వుంటారు. ఇప్పటికే శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్గా ఎంపికైన నేపథ్యంలో.. మూడో కథానాయికగా ఐషాశర్మ సెలెక్ట్ అయ్యింది. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్పైకి రానుంది.