నాగార్జునతో సోగ్గాడు.. చైతూ సరసన లావణ్య త్రిపాఠి.. రెండో ఛాన్స్ అందుకేనా?
‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో లావణ్య త్రిపాఠికి మంచి మార్కులు వచ్చేశాయి. నాలుగు సినిమాలతో ఫ్లాప్లో ఉన్న ఈ భామకు.. మారుతి హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం వరుస పెట్టి యంగ్ హీరోల సినిమాలన్నీ ఖాతాలో వేసుకు
‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో లావణ్య త్రిపాఠికి మంచి మార్కులు వచ్చేశాయి. నాలుగు సినిమాలతో ఫ్లాప్లో ఉన్న ఈ భామకు.. మారుతి హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం వరుస పెట్టి యంగ్ హీరోల సినిమాలన్నీ ఖాతాలో వేసుకుంటోంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంతో ఈ భామ అక్కినేని కాంపౌడ్లో అడుగు పెట్టింది. అక్కడ ఆరంభంతో లావణ్యకు ఘనస్వాగతం లభించింది. ఆ క్రమంలో సోగ్గాడే పెద్ద హిట్. తాజాగా ఆ కాంపౌండ్ నుంచే మరో యూత్ఫుల్ ఆఫర్ పట్టేసింది.
నాగచైతన్య హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో అందాల రాక్షసి సెకండ్ హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇప్పటికే మెయిన్ రోల్లో రకుల్ ప్రీత్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. స్టోరీ డిమాండ్ మేరకు లావణ్యను తీసుకున్నారు. దర్శకుడు హిట్టు హీరోయిన్ అన్న సెంటిమెంట్ను ఫాలో అయ్యాడని కూడా వార్తలు వస్తున్నాయి.
కల్యాణ్ కృష్ణ తొలి సినిమా సోగ్గాడు ద్వారా రూ.50కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఆపై బ్లాక్ బస్టర్గా నిలిచింది. అందుకే అదృష్టం కలిసొస్తుందని త్రిపాఠికి చైతూతో నటించే ఛాన్సిచ్చాడు. తద్వారా అక్కినేని నాగార్జున సరసన నటించిన లావణ్య.. చైతూతోనూ నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాలు తెలిపాయి.