నలుగురు హీరోయిన్స్తో సోగ్గాడే చిన్ని నాయన రొమాన్స్!
నలుగురు హీరోయిన్స్తో నాగార్జున రొమాన్స్ చేస్తున్నాడు. అక్కినేని అభిమానుల భారీ అంచనాలకు ధీటుగా రూపుదిద్దుకుంటున్న సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున 50 పదుల్లోనూ నలుగురు కథానాయికలతో రొమాన్స్ చేశాడు. ఈ నలుగురిలో లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ, హంసానందిని, అనసూయలు ఉన్నారు. కాగా నాగార్జున ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ పూర్తవగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని నవంబరులో రిలీజ్ చేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. డబుల్ రోల్తో పాటు మూడో రోల్లో నాగ్ దెయ్యంగా కనిపిస్తారని సినీ యూనిట్ అంటోంది.