గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 23 జూన్ 2017 (06:59 IST)

నందమూరి బాలయ్యతో మళ్లీ జతకడుతున్న నయనతార

ఇదివరకు ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాల్లో జోడీ కట్టిన నందమూరి బాలకృష్ణ, నయనతార ముచ్చటగా మూడోసారి జంటగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ఈ సారి కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వం వహించే సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర న

ఇదివరకు ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాల్లో జోడీ కట్టిన నందమూరి బాలకృష్ణ, నయనతార ముచ్చటగా మూడోసారి జంటగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ఈ సారి కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వం వహించే సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత సి. కల్యాణ్‌ ధ్రువీకరించారు. 
 
‘‘బాలకృష్ణ సరసన ఇద్దరు నాయికలుంటారు. ఒక నాయికగా నయనతారను ఎంపిక చేశాం. కథ వినగానే నాయికగా నటించేందుకు ఆమె అంగీకరించారు. కచ్చితంగా బాలకృష్ణ, నయనతార జోడీ మరోసారి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ నెలాఖరున లాంఛనంగా షూటింగ్‌ ప్రారంభించి, జూలై నెలాఖరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తాం’’ అని ఆయన చెప్పారు. 
 
ఫ్యాక్షన్‌ నేపథ్యంలో నడిచే ఈ కథలో కె.ఎస్‌. రవికుమార్‌ శైలి వినోదంతో పాటు, సెంటిమెంట్‌, యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామా అంశాలు ప్రధానంగా ఉంటాయి. తొలి షెడ్యూల్‌ను తమిళనాడులోని కుంభకోణంలో నిర్వహిస్తారు. 2018 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలనేది నిర్మాత సంకల్పం. 
 
ఎం.రత్నం సంభాషణలు రాస్తున్న ఈ చిత్రానికి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫేమ్‌ చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తుండగా, శ్యామ్‌ కె. నాయుడు ఛాయాగ్రాహకునిగా పనిచేస్తున్నారు. బాలకృష్ణతో మరో చిత్రంలో నటించడానికి నయనతార ఇటీవల తిరస్కరించినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ ఇద్దరూల మరోసారి జోడీ కడుతుండటం బాలయ్య అభిమానులను సంతోషపెడుతోంది.